కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
చంద్రబాబు రైతు ద్రోహి
04 Jul 2018 2:30 PM
చిత్తూరు: రైతులపై చంద్రబాబుకు ఉన్నది దొంగ ప్రేమ అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ఆమె విమర్శించారు. మామిడికాయ రైతులు బుధవారం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై మామిడికాయలు వేసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు రోజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న టమాట రైతులు, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డునపడ్డారని తెలిపారు. ఇది చంద్రబాబు సర్కార్కు సిగ్గు చేటు అన్నారు. గతంలో రైతులను విస్మరించిన కారణంగా చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని, ఇప్పుడు అదే గతి పడుతుందని హెచ్చరించారు.