అత్యంత ప్రజాద‌రణ కలిగిన నేత వైయస్‌ జగన్‌

ప్రజాద‌రణ చూసి టీడీపీకి నిద్దురపట్టడం లేదు
కెమెరా ముందే కాదు.. ట్వీట్లు చేయడంలో లోకేష్‌ విఫలం
విటమిన్‌ పప్పు అనుకుంటే గన్నేరుపప్పులా మారాడు
ఆరోపణలు నిరూపించకపోతే కళా వెంకట్రావు రాజకీయ సన్యాసం తీసుకుంటాడా?
ఓటుకు కోట్ల కేసు కోసమే కేసీఆర్‌ వద్దకు దేవినేని
ఏరువాక కాదు.. చంద్రబాబుపై పోరువాక చేయడానికి రైతులు సిద్ధం
ఆడవారిపై నేరాల్లో ఆంధ్రరాష్ట్ర ర్యాంక్‌ పైపైకి
టీడీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే మహిళలు తరిమికొట్టాలి
తనను తాను పరిచయం చేసుకునేందుకే సీఎం రమేష్‌ దీక్ష
హైదరాబాద్‌: దేశంలో ఏ నాయకుడికి లేనంత ప్రజాధరణ వైయస్‌ జగన్‌కు ఉందని, ప్రజాధరణ చూసి టీడీపీకి నిద్దురపట్టడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఏ విధంగానైనా ప్రజలను తమవైపు తప్పుకోవాలనే టీడీపీ అగచాట్లు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. మీడియా ముందుకు వస్తే పార్టీ పరువు తీస్తున్నాడని.. మంత్రి లోకేష్‌ను ట్వీట్లకు పరిమితం చేశారని, ఆయన పెట్టే ట్వీట్లు చూస్తే నిజంగా ముద్దపప్పు అని అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఏం మాట్లాడారో.. ఆమె మాటల్లోనే.. కెమెరా ముందుకు తెలుగుదేశం పార్టీ లొసుగులన్నీ బయటపెడుతున్నాడనే ఉద్దేశంతో లోకేష్‌ను ట్విట్టర్‌కు పరిమితం చేశారు. అందుకు నలుగురిని అపాయింట్‌ చేశారో.. లేక ఆయన పెడుతున్నారో తెలియదు కానీ.. తాజాగా అతను పెట్టిన ట్వీట్‌తో లోకేష్‌ అప్పు అని అర్థం అవుతుంది.

ఫ్లెక్స్‌ అనే కంపెనీని శ్రీసిటీలోని ఎస్సీజెడ్‌లో పెడుతున్నారు. ఎస్సీజెడ్‌లో రాయితీలన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధం లేదు. ఇంతపెద్ద కంపెనీని తీసుకొస్తే అన్ని పేపర్లలో పెద్ద పెద్దగా కథనాలు వస్తే సాక్షిలో చిన్నగా రాశారని లోకేష్‌ ట్వీట్‌ చేశాడు. ఇతన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఎస్సీజెడ్‌ పెట్టింది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. రాష్ట్రానికి సంబంధం లేనప్పుడు రాయడానికి పచ్చమీడియా ముందుంటుంది. సాక్షికి ఏం సంబంధం. ఇదిగో ఒప్పందం అంటే అదిగో పరిశ్రమ అంటూ ఏమీ లేకుండానే పచ్చమీడియా పెద్ద పెద్ద కథనాలు రాస్తుంది. నాలుగు ఏళ్లలో చంద్రబాబు మూడు సార్లు పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు జరిగితే రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులని చెప్పడం దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడంలా పచ్చమీడియా వైఖరి ఉంటుంది. చంద్రబాబు అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారు. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులని ప్రకటిస్తే కనీసం 20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. రూ. 16,933 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇన్ని రోజులు లోకేష్‌ పప్పు అంటే విటమిన్‌ ఉండేది అనుకున్నారు.. కానీ గన్నేరు పప్పు అని చంద్రబాబుకు అర్థమైంది. 


తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజయవాడ దుర్గకు వస్తే దేవినేని ఉమా ఎందుకు వచ్చారో చెప్పాలి. ప్రోటోకాల్‌ కోసం వచ్చారా.. లేక కాళ్లపట్టుకోవడానికి వచ్చారా.? తిరుపతికి అమిత్‌షా వస్తే రమణదీక్షితులు వెంట నడిచారని అర్చక పదవి నుంచి తీసేశారు. మరి దేవినేని ఎందుకు వెళ్లారు. దేవినేని ఉమ అంటే ఆడా.. మగా అని కేసీఆర్‌ అని వ్యాఖ్యానించినా మంత్రి ఎందుకు వచ్చినట్లు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు పంపించింది నిజం కాదా..?

తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు ఒక లెటర్‌ విడుదల చేశారు. దాంట్లో 12 ప్రశ్నలు వేశారు. కళా వెంకట్రావు అంటే ఇంతకు ముందు గౌరవం ఉండేది. పచ్చ మీడియా ఉందని పిచ్చిరాతలు రాస్తే చూస్తూ ఊరుకోం. లేఖలో మొదటి ప్రశ్న వైయస్‌ జగన్‌ లక్ష కోట్ల అవినీతి గుర్తించి ప్రస్తావించారు... నాలుగు సంవత్సరాలు బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ లక్ష కోట్ల అవినీతి ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయింది. అసెంబ్లీ సాక్షిగా  లక్ష కోట్ల ఆస్తి చూపించి పది శాతం ఇస్తే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడతానని వైయస్‌ జగన్‌ చెప్పారు. నిరూపించే దమ్ములేక తెలుగుదేశం తోకముడిచి పారిపోయింది. అయినా సిగ్గులేకుండా పాతపాటే పాడుతున్నారు. 

టీటీడీని బీజేపీతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీ భ్రష్టుపట్టిస్తుందంట. తిరుమలను భ్రష్టుపట్టించింది చంద్రబాబు.. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసి ఆ భగవంతుడి కోపానికి గురై బతికిబయటపడింది చంద్రబాబు. సంబంధం లేనివారిని మెంబర్లు చేయడం. పవిత్ర లేని వారిని చైర్మన్లు చేయడం. పోటును తవ్వి అపవిత్రం చేయడం. దొంగతనాలకు లెక్కలు చూపించకుండా తప్పించుకునేందుకు నిందలు ప్రతిపక్షంపై వేస్తున్నారు. బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసింది టీడీపీ. నాలుగేళ్లు అధికారాన్ని రాష్ట్రంలో కేంద్రంలో అనుభవించింది టీడీపీ. పరకాల ప్రభాకర్‌ను సలహాదారుడిగా కొనసాగింది టీడీపీ. బీజేపీ మంత్రి భార్యను దేవస్థానంలో మెంబర్‌గా పెట్టింది టీడీపీ. కుట్రలకు, కుతంత్రాలకు పెటెంట్‌ రైట్స్‌ టీడీపీకే ఉన్నాయి. ఏ రోజు వైయస్‌ఆర్‌ సీపీ బీజేపీతో కలవలేదు. కలుస్తామని చెప్పలేదు. పెన్ను పేపర్‌ ఉందని ఇలాంటి పిచ్చిరాతలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతీ లైన్‌కు క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కళా వెంకట్రావు వీటిని నిజం అని నిరూపించాలి. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలి.  

వ్యవసాయమే దండగ అనే చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే ఏరువాక పండుగ అని మరో కొత్త డ్రామాను తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చకుండా రైతులను మోసం చేశాడు. అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రూ. 87 వేల కోట్ల అప్పులను కోత విధించి 20 వేల కోట్లకు తీసుకొచ్చారు. ఇవాల్టికి ఇచ్చింది రూ. 13 వేల కోట్లు కూడా నాలుగు విడుతల్లో ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు.
ఏరువాక కాదు.. చంద్రబాబుపై పోరువాక చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మోసం చేయడం మానుకోవాలని తెలియజేస్తున్నాం. 

దేశంలో మహిళలపై జరిగే క్రైం రేటులో 2014–16లో ఆంధ్రరాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదల సర్వేలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంటే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉంది. ఇంకా మహిళలపై జరుగుతున్న అన్ని కేసులు ఫైల్‌ చేస్తే ఏ స్థానంలో ఉంటుందో ప్రజలే ఆలోచించాలి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌తో పచ్చకాల నాగులు అమరావతిని ఏ విధంగా భ్రష్టుపట్టించారో.. ఆ మాఫియాను అమరావతి నుంచి చికాగో వరకు తీసుకెళ్లి తెలుగు గౌరవాన్ని గంగలో కలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెడితే ఆయన్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు చికాగోలో మన గౌరవన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా..? శ్రీ గౌతమి హత్య కేసులో తన అక్కను తన కళ్లముందే సజ్జాబుజ్జి అనే వ్యక్తి కారుతో గుద్ది చంపాడని ఒకటిన్నర సంవత్సరం పోరాడి నలుగురికి జైలు శిక్ష పడేలా చేసింది. ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ సీపీ, సాక్షి పేపర్, ప్రజా సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. కనీసం ఆ యువతికి సపోర్టు చేయని పచ్చమీడియా ఇవాళ మావల్లే న్యాయం జరిగింది పెద్ద పెద్ద కథనాలు రాసుకోవడం బాధాకరం. 
 
చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతం తేలప్రోలు గ్రామ సర్పంచ్‌ హరిణికుమారిని తన భర్త జితేంద్ర శారీరంగా హింసిస్తున్నాడని కేసు పెడితే.. జిల్లా మంత్రులు ఆ వెధవకు సపోర్టు చేస్తున్నారు. సోషల్‌ మీడియా సపోర్టు కోరుకుంటూ బాధితురాలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి మహిళలంటే చులకన. ఇది ప్రతీసారి నిరూపణ అవుతోంది. నారాయణ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయిన చంద్రబాబు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించడం లేదు. ఎన్నికల టీడీపీ నేతలు ఇంటి ముందుకు వస్తే మహిళలంతా వారిని తరిమికొట్టాలి. ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ రాజ్యసభలో ప్రశ్న వస్తే.. ఏపీ, తెలంగాణలో 9.4 శాతం మహిళలపై దాడులు పెరుగుతున్నట్లుగా ఎన్‌సీఆర్‌డీ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాష్ట్ర వృద్ధి రేటు పెరగదు కానీ మహిళలపై దాడుల్లో రేటింగ్‌ విపరీతంగా పెరుగుతోంది.
 
కడపకు అన్యాయం జరుగుతున్నట్లుగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ నిరాహార దీక్ష చేయడం సిగ్గుచేటు. ఎవరి ప్రభుత్వంపై దీక్ష చేస్తున్నావు? రాష్ట్ర వనరులను అణువనువు దోచుకుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు స్టీల్‌ ప్లాంట్‌ గుర్తుకు రాలేదు. వైయస్‌ఆర్‌ ఏర్పాటు చేస్తుంటే అడ్డుకున్నది చంద్రబాబే.. మళ్లీ అన్యాయం చేశారని మాట్లాడడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కుదరదని చెప్పినా ఎందుకు ఎన్డీయేలో కొనసాగారు. స్వప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని దొంగ దీక్షలు. నాలుగేళ్లలో మూడున్నర లక్షల కోట్లు దోచుకొని అవి అరగక దీక్షలు చేస్తున్నారు. సీఎం రమేష్‌ అనే వ్యక్తి కడపలో ఉన్నాడని తెలియజేసేందుకే లక్షలు ఖర్చు చేసి దీక్షలు చేస్తున్నారు. సీఎం రమేష్‌ దీక్షను టీడీపీ ఎంపీలే తప్పుబడుతున్నారు. ఉక్కు దీక్షా.. తుక్కు దీక్షా దీని వల్ల ఏం వస్తుందని జేసీ మాట్లాడారు. 
 
Back to Top