పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఉక్కు పరిశ్రమ ఆలోచన వైయస్ఆర్దే
25 Jun 2018 3:22 PM
వైయస్ఆర్ జిల్లా: రాయలసీమను అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం, కడప ఉక్కు పరిశ్రమ స్థాపించాలని భావించారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఆలోచన మహానేత వైయస్ఆర్దే అన్నారు. రాయలసీన అభివృద్ధి చెందాలంటే సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రవీంద్రనాథ్రెడ్డి డిమాండు చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, రాయలసీమకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆ నాడు జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కడప స్టీల్ ప్లాంట్కు చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాడు ఉక్కు పరిశ్రమను అడ్డుకున్నారని, ఇవాళ ఆ పార్టీ నేతలతో దొంగ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.