వైయస్‌ఆర్‌సీపీది నిజమైన పోరాటం

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. రాజంపేట మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారని, వారిది చిత్తశుద్ధి అయిన పోరాటమన్నారు. టీడీపీ ఎంపీ మాత్రం రాజీనామా చేయకుండా దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు కాంట్రాక్ట్‌లు ముఖ్యమని, ప్రజల ప్రయోజనాలు పట్టవన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top