గిరిజనులు మృత్యువాత పడుతున్నా పట్టదా..!

విశాఖ‌: సీజనల్‌ వ్యాధులతో గిరిజన ప్రాంతాలు అల్లాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మృతుల సంఖ్యపై కూడా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలను వివరించామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సరైన వైద్యం అందక గిరిజనులు మృత్యువాతపడుతున్న టీడీపీ నాయకులు, అధికారులు పట్టించుకోని దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడుమీదకు వస్తున్నారన్నారు. 
Back to Top