రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
టీడీపీకి కాంగ్రెస్ గతే పడుతుంది
10 Apr 2018 12:46 PM
ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే.. టీడీజేపీ, బీజేపీలకు పడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ అనేక పోరాటాలు చేశారన్నారు. ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ నిజాయితీతో హోదా ఉద్యమం చేస్తుంది కాబట్టే ప్రజలు, జాతీయ పార్టీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారన్నారు. నేడు జాతీయ రహదారుల నిర్భందం, రేపు రైలురోకో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేసే దుస్థితి నెలకొందన్నారు.