చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి బాబూ?
13 Mar 2018 3:57 PM
విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. ఫిరాయింపు వ్యవహారంపై ప్రజలు, న్యాయస్థానం ఆగ్రహంతో ఉందని, ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సూచించారు. రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం పట్ల వారు స్పందించారు. చంద్రబాబు నాలుగేళ్లుగా తప్పుమీద తప్పు చేస్తూ తనకున్న అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ తీరు చూసి కోర్టులు కూడా విసుగు చెంది నోటీసులు ఇచ్చారని చెప్పారు.