మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అక్రమ మైనింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
13 Aug 2018 12:02 PM
గుంటూరు: గురజాల అక్రమ మైనింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. గురజాలలో అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న పార్టీ నాయకులనుపోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ నాయకులు నడిరోడ్డుపై మీటింగ్ పెట్టుకుంటే అనుమతించిన పోలీసులు..మేం చట్టప్రకారం అనుమతి కోరినా నిరాకరించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అంతా పోలీస్ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. అక్రమ మైనింగ్ వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.జిల్లాలో 28 లక్షల టన్నుల తెల్లరాయిని టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.