<br/><br/><br/>విజయవాడ: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండు చేశారు. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉందన్నారు. ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. ఈ నెల 10న విశాఖలో నిర్వహించే బ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొని బ్రాహ్మణుల సంక్షేమంపై చర్చిస్తారన్నారు. <br/>