మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రత్యేక హోదా దోషి బీజేపీ, టీడీపీలు
09 Aug 2018 2:48 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
గుంటూరు: ప్రత్యేక హోదా దోషులు చంద్రబాబు, నరేంద్రమోడీనే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ యూటర్న్ తీసుకొని హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా రెండు ప్రభుత్వాలతో పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం, రాష్ట్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసి ఇవాళ పోరాడుతున్నామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు తన టక్కుటమార విద్యతో ప్రజలను మోసం చేయడం తగదని, బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.