వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్ష భగ్నం..అరెస్ట్

చిత్తూరుః రామచంద్రాపురం మండలం, సి. రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు తొలగించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  ఎమ్మెల్యేతో పాటు మరో 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.

Back to Top