మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నారు
13 Jul 2018 2:12 PM
– సింగపూర్ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారు?
– రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది
– ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అథమ స్థానం
హైదరాబాద్: ఏపీతో సింగపూర్ వాళ్లే లబ్ధిపొందుతున్నారని, వారి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు దోచి పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగపూర్ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. సింగపూర్ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. టికెట్టు తీసుకుని ఆ సదస్సుకు వెళ్లారన్నారు. నాలుగేళ్లలో ఆయన ఆరుసార్లు సింగపూర్కు వెళ్లారని విమర్శించారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రికల్ బైక్స్లో తిరుగుతున్నట్లు చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.ప్రధాని తరువాత ఎక్కు విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబే అన్నారు.
–రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతుందని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతూ చంద్రబాబు మాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మీటింగ్స్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేశానని రైతులతో బలవంతంగా పలికిస్తూ..వారికి అనుకూలమైన మీడియాలో మాఫీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రుణాలు సగమే మాఫీ చేశారని ఆయన విమర్శించారు. అర్థం కాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబులో చాలా ఉందన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మంత్రి యనమల రామకృష్ణుడిని తోడు తీసుకెళ్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన మీటింగ్లకు ముఖ్యమంత్రి పోవడమే తప్పు అయితే ఆయన వెంట మంది మార్భలంతో వెళ్లడం సరికాదన్నారు. రామకృష్ణుడు మీకు ధైర్యం ఇచ్చేందుకు వస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఆర్థికశాఖ మంత్రి ప్రతిసారి మీ పక్కన ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజీనెస్ అంటే వాణిజ్యం సులభంగా చేయడంలో ఏపీ నంబర్ వన్ అని ఊదరగొడుతున్నారన్నారు. రాష్ట్రం బాగుపడితే అందరూ మద్దతిస్తారని, వీరు చేసే తప్పుడు ప్రచారంతో ఏపీ పరువు పోతోందన్నారు. 2016–2017లో ఏపీ నంబర్ వన్ ర్యాంకు అని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వచ్చిందని చెబుతున్నారన్నారు. వాస్తవానికి అధమ స్థానంలో ఉందని ఆయన వివరించారు. ఇంతవరకు రాష్ట్రానికి పెట్టుబడి ఎంత వచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు.