దోపిడీని గమనించారని బాబు యూటర్న్‌

 
గుంటూరు: లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారని చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని తెలిపారు. చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై చంద్రబాబు కేసులు ఎత్తివేయడం లేదని, శాసన సభలో ప్రత్యేక హోదా సాధనకు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించలేదన్నారు. తమ ప్రాణాలను, పదవులను రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఐదుగురు ఎంపీలు ముందుకు రావడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  బీజేపీ ప్రభుత్వంపై ఐదుగురు ఎంపీలతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైయస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎక్కడ వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందో అని భయపడి చంద్రబాబు వెనుకడుగు వేశారన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నాయకుడైతే రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ వెంట నడవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్ర మోడీలకు గుణపాఠం చెప్పాలని సూచించారు.
 
Back to Top