కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ కు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ
02 Nov 2017 6:33 PM
హైదరాబాద్ః ప్రతిపక్ష నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆయన పర్సనల్ సెక్రటరీ గురువారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్ జెడ్ కేటగిరి భద్రత పరిధిలో ఉన్న విషయం మీకు విదితమేనని, దానికి అనుగుణంగా భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
సుమారు ఏడు నెలల పాటు జరిగే వైయస్ జగన్ పాదయాత్రకు భద్రత కల్పించాలని డీపీజీని కోరారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ 13 జిల్లాల్లో సుమారు 3వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుందని, త్వరలోనే రూట్మ్యాప్ను పోలీసులకు జిల్లాల వారీగా ఆ పార్టీ ఇన్ఛార్జ్లు అందచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా వైయస్ జగన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు,పార్టీ నేతలు, అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.