చర్యలు తీసుకోండి..వైయస్సార్సీపీ శాసనసభ పక్షం

హైదరాబాద్) పార్టీ
ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలని వైయస్సార్సీపీ శాసనసభ పక్షం మరోసారి
స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ కు పార్టీ
తరపున ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఫిర్యాదు చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులపై క్రమశిక్షణా చర్యలు
తీసుకోవాలని వినతి పత్ర సమర్పించారు.  వారితో పాటు వైఎస్సార్‑సీపీ గుర్తుపై గెలిచి
టీడీపీలో చేరిన వారందరిపై అనర్హత వేటు వేయాలని  ఇందులో కోరారు. 

తాజా వీడియోలు

Back to Top