పోలీసుల తీరుపై వైయస్సార్సీపీ నేతల ఆగ్రహం

అనంతపురం(రాప్తాడు): 

కర్నూలులో వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా ...రాప్తాడు మండల కేంద్రంలో వైయస్సార్సీపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా పది మంది వైయస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తుండగా రాప్తాడులో మాత్రం పోలీసులు అనుమతించక పోవడంపై వైయస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


To read this article in English:  http://bit.ly/1rQKoBf 

Back to Top