చంద్ర‌బాబుది రెండు నాల్క‌ల ధోర‌ణి



 విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కలెక్ట‌రేట్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా  వారు మాట్లాడుతూ..పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చార‌ని విమ‌ర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నారు. సదస్సులు నిర్వహించి ఏపీకి హోదా అక్కర్లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పడానికి సీఎం చంద్రబాబు విఫలయత్నాలు చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మేలును అనేక పోరాటాల ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నార‌న్నారు.  రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమల్లో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం జననేత వైయ‌స్ జగన్ ఆధ్వర్యంలో చివరివరకూ పోరాడుతామని వారు స్ప‌ష్టం చేశారు.
Back to Top