వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు


వైయస్‌ఆర్‌ జిల్లా: పెదదండ్లూరులో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు చేసిన పోలీసులు మంత్రి ఆది కుటుంబ సభ్యులపై సాధారణ కేసులు నమోదు చేశారు. మంత్రి ఆది తనయుడు సుధీర్‌రెడ్డి,భార్య అరుణ, సోదరులు రామాంజనేయులురెడ్డి, శివనారాయణరెడ్డిలపై కేసు నమోదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు ఫిర్యాదు చేస్తే.. చోటా నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు చేతులు దులుపుకున్నారు. మొత్తం 136 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.
Back to Top