సల్లాపురెమ్మకు వైయస్‌ఆర్‌ సీపీ నాయకుల ప్రత్యేక పూజలు

చిత్తూరు: బైరెడ్డిపల్లె మండలపరిదిలోని గంగినాయనపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తయిండ్లు గ్రామంలో బుధవారం రాత్రి వైభవంగా సల్లాపురెమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం   ఎంపీపీ విమల, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర  కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి, సంయుక్తకార్యదర్శి దయానందగౌడు, సర్పంచ్‌ వెంకటేష్, వైస్‌సర్పంచ్‌ తబ్రాజ్, ఎంపీటీసీలు అబ్దుల్‌సత్తార్‌సాబ్, వెంకటేష్, నారాయణప్ప, శ్రీనివాసులు, ఫైజుల్లా,   మహబూబ్‌ఖాన్, పాతురుబాబు, కార్తిక్, బాలక్రిష్ణ, లక్ష్మినారాయణ, సుధాకర్, కుమార్, చంగల్రాయప్ప, మణి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.  

Back to Top