చింతమనేనికి బుద్ధి రావడం లేదు


పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు శిక్ష వేసినా బుద్ది రావడం లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, కటారి రామచంద్రరావు అన్నారు.  చంద్రబాబు, లోకేష్‌ అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దాడులు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని విమర్శించారు. కోర్టులు చింతమనేనికి శిక్ష వేసినా బుద్ధి రాలేదని, గతంలో చింతమనేని వనజాక్షిపై దాడి చేశారని గుర్తు చేశారు. చింతమనేని దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
Back to Top