ఎస్సీ,ఎస్టీల ఓట్లు లేకుండా ఇన్నేళ్లు తాడిపత్రిలో గెలిచారా?



అనంతపురం: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి దళితుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు హెచ్చరించారు. ‘నా శవయాత్ర చేశారు..  నాకు అంతమంది కొడుకులు ఉన్నారని తెలీదు.. శవాన్ని తీసుకెళ్లి ఊరేగించి, దహనం చేసేది కొడుకులే.. జిల్లాలో ఇంత మంది కొడుకులను నేను ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు’ అంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  స్థానిక ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ ..ఎస్సీ,ఎస్టీల ఓట్లు లేకుండా ఇన్నేళ్లు తాడిపత్రిలో గెలిచారా?  అని ప్ర‌శ్నించారు.ఇటీవల విజయవాడలో జరిగిన మహానాడులో ఎరుకుల కులస్తులను కించపరిచేలా ఎంపీ మాట్లాడారని, తాజాగా దిష్టిబొమ్మను శవయాత్ర చేసిన ఎస్సీలను తనకు పుట్టారా? అంటూ సంబోధించడం ఆయన దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు. 
Back to Top