జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!
ఎస్సీ,ఎస్టీల ఓట్లు లేకుండా ఇన్నేళ్లు తాడిపత్రిలో గెలిచారా?
04 Jun 2018 10:32 AM
అనంతపురం: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి దళితుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు హెచ్చరించారు. ‘నా శవయాత్ర చేశారు.. నాకు అంతమంది కొడుకులు ఉన్నారని తెలీదు.. శవాన్ని తీసుకెళ్లి ఊరేగించి, దహనం చేసేది కొడుకులే.. జిల్లాలో ఇంత మంది కొడుకులను నేను ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు’ అంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక ఓవర్బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ ..ఎస్సీ,ఎస్టీల ఓట్లు లేకుండా ఇన్నేళ్లు తాడిపత్రిలో గెలిచారా? అని ప్రశ్నించారు.ఇటీవల విజయవాడలో జరిగిన మహానాడులో ఎరుకుల కులస్తులను కించపరిచేలా ఎంపీ మాట్లాడారని, తాజాగా దిష్టిబొమ్మను శవయాత్ర చేసిన ఎస్సీలను తనకు పుట్టారా? అంటూ సంబోధించడం ఆయన దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు.