ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
పోలవరానికి బయలుదేరిన వైయస్ఆర్సీపీ బృందం
07 Dec 2017 12:05 PM
అమరావతి: సీఎం చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసేందుకు, పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిని పరిశీలించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరింది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ నేతల బృందం గురువారం ఉదయం బస్సు యాత్రకు బయలుదేరింది. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, మరికొందరు కీలకనేతలు ఉన్నారు. విజయవాడలో బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని, అనంతరం నేతలు ప్రాజెక్టును పరిశీలించనున్నారు.
దుర్మార్గ పాలనను ప్రజలకు చూపించేందుకే..
పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలనను ప్రజలకు చూపించేందుకు వైయస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం పోలవరం సందర్శనకు బయలుదేరింది. టెండర్ల అంశాలను, వాస్తవాలను తెలుసుకోవడానికి వైయస్ఆర్ సీపీ నేతలు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం సమాధి కట్టాలని యోచిస్తోంది. పోలవరం ప్రాజెక్టును రక్షించేందుకు, సత్వరం నిర్మించేందుకు అన్ని రకాలుగా చంద్రబాబు సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు బస్సుయాత్రను మార్గంగా ఎంచుకున్నట్లు వైయస్ఆర్ సీపీ బృందం తెలిపింది. నిర్వాసితులకు అమలు చేస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులతో మాట్లాడి తెలుసుకుంటామన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు దక్కించుకుని పనులు చేపట్టారని, ఆయన చెబుతున్నదానికి పనులు జరుగుతున్న తీరుకు సంబంధం లేదన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చెబుతున్న అబద్దాలు, అవాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది.