ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది

 చిత్తూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రదారుడని ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్‌ తప్పుడు దారిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ప్రభుత్వాన్ని నడిపారని వివరించారు. టీడీపీతో కలిసి నడవకపోయినా రాబోయే కాలంలో మద్దతు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కిరణ్‌ సోదరుడు టీడీపీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని, పీలేరు నుంచి కూడా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఏకాకిగా దొంగ చాటుగా కండువా వేసుకున్న వ్యక్తులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు 


Back to Top