మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది
13 Jul 2018 4:50 PM
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కుట్రదారుడని ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ తప్పుడు దారిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ప్రభుత్వాన్ని నడిపారని వివరించారు. టీడీపీతో కలిసి నడవకపోయినా రాబోయే కాలంలో మద్దతు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కిరణ్ సోదరుడు టీడీపీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని, పీలేరు నుంచి కూడా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఏకాకిగా దొంగ చాటుగా కండువా వేసుకున్న వ్యక్తులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు