చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎన్నికలకు సిద్ధమా బాబూ?
16 Jul 2018 1:19 PM
విజయవాడ: అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన సాగుతుందని, చంద్రబాబుకు దమ్ముంటే 1500 రోజుల విజయాలపై ఎన్నికలకు సిద్ధమా అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ అన్నది అన్నపూర్ణ రాష్ట్రమని, గతంలో ఈ రాష్ట్రం నష్టపోవడానికి చంద్రబాబు కూడా ఓ ప్రధాన కారణమన్నారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఏపీకి పెట్టుబడులు వచ్చాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసి, మీ ప్రభుత్వం సాధించిందేంటో వివరించాలని డిమాండు చేశారు.