సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
ఫిరాయింపులపై అనర్హత వేటు వేయండి..మర్నాడే సభకు వస్తాం
06 Sep 2018 11:59 AM
విశాఖ జిల్లాః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మా ఎమ్మెల్యేలు మర్నాడే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకావడం లేదో బహిరంగ లేఖ రాశామన్నారు. వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్షాన్ని అంతుచూస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైయస్ఆర్సీపీ ఆధిపత్యం సాధించిందన్నారు. బాబుపాలనను ఎండగడుతూ సోషల్మీడియా విమర్శించిందన్నారు..సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ జరుగుతున్న అరెస్ట్లు దారుణమన్నారు. ఏ పార్టీ ఏపీకి అన్యాయం చేసిందో అటువంటి కాంగ్రెస్తో టీడీపీ జత కట్టిందని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలకు త్వరలో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. సోషల్ మీడియాలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పేర్కొందని గుర్తుచేశారు. 23 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ముగ్గురిని మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని ఆయన డిమాండు చేశారు.