మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బడా బాబులకు వేల కోట్లు ఎక్కడివి?
20 Dec 2016 4:25 PM
గుంటూరు: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బడా బాబులకు వేల కోట్ల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ నాయకులు ఏసీ రూముల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కనీసం వంద రూపాయలు తెచ్చుకొనేందుకు కూడా సామాన్యుడు చాలా కష్టపడుతున్నాడన్నారు. ఏ నాడు కూడా టీడీపీ నేతలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేదని విమర్శించారు. బయటకు వచ్చి చూస్తే ప్రజల ఇబ్బందులు అర్థమవుతున్నాయని సూచించారు. చంద్రబాబు నిత్యం టెలీ కాన్ఫరెన్స్లు అంటూ ఏసీ రూముల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, ప్రజల్లోకి వచ్చి అసలు ఇక్కట్లను గమనించాలని మోపిదేవి సూచించారు.