‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
కష్టాలు కడతేర్చే నాయకుడొచ్చాడు
11 Aug 2018 12:39 PM
యనమల సోదరుల అరాచకాలు అడ్డుకొని ఆదుకుంటాడని ఆశ
జననేత రాకకోసం తుని ప్రజల ఎదురుచూపు
తూర్పుగోదావరి: తమ కష్టాలు తీర్చే నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రాకకోసం తుని ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు, మోసకారి చంద్రబాబు ప్రభుత్వ అధికార అహం అణిచివేసేందుకు నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర నేడు 103వ నియోజకవర్గం తునిలోకి అడుగుపెడుతుందన్నారు. వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారని రాజా అన్నారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారని, జననేత వచ్చి కష్టాల నుంచి తమను కాపాడుతాడనే కొండంత ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తుని నియోజకవర్గంలో నాలుగు రోజులు ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుందని, తుని మండలం, టౌన్ నుంచి కోటనందూరు మండలం మీదుగా నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు.