కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. లక్ష బాకీ
07 Aug 2018 11:48 AM
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష రూపాయలు నిరుద్యోగ భృతి కింద బాకీ పడిందని వైయస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యువకులను నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందని వైయస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రావడానికి బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదం ముఖ్యమైందన్నారు. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు మాట తప్పారని మండిపడ్డారు. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని 10 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కోక్కరికి నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటే నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు.