మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఇంకా కేంద్రంతో ఎందుకు కొనసాగుతున్నారు బాబూ?
26 Feb 2018 11:50 AM
కాకినాడ: చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకు ఇంకా కేంద్రంతో కొనసాగుతున్నారని వైయస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. కాకినాడలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కన్నబాబు పాల్గొని మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు చేసినా ఎందుకు కేంద్రం స్పందించలేదని, ఒక్క విభజన హామీనైనా సాధించారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. హోదా సాధనకు వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు.