పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
వైయస్ఆర్ జయంతిన 2500ల మైలురాయి ఓ జ్ఞాపకం
08 Jul 2018 3:48 PM
తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిన ఆయన తనయుడు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేసుకోవడం చరిత్రలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వలసపూడి వంతెన వద్ద వైయస్ జగన్ పాదయాత్ర 2500ల మార్కు దాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై దాదాపు 8 నెలల నుంచి రాష్ట్రంలో ఎండనకా.. వాననకా అలుపెరగకుండా తిరుగుతున్నారన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు జననేత పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు.