బాబు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు


తూర్పుగోదావరి: మైనారిటీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని రిటైర్డు ఐజీ ఇక్బాల్‌ విమర్శించారు. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తానని,  కేంద్రంపై యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నీతి అయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీకి వంగి వంగి దండాలు పెట్టారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు.  తండ్రి బాటలో నడుస్తున్న వైయస్‌ జగన్‌ ప్రజలకు మంచి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top