టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
హజ్యాత్ర సబ్సిడీ ఎత్తివేతపై టీడీపీ మౌనమేందుకో?
20 Jan 2018 1:36 PM
వైయస్ఆర్ జిల్లా: కేంద్ర ప్రభుత్వం హజ్యాత్ర సబ్సిడీ ఎత్తివేస్తే ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగు దేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆయన నిలదీశారు. హజ్యాత్ర సబ్సిడీ కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. హజ్ యాత్రకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడం సమంజసం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అనేక మంది పేద ముస్లింలు మక్కాను దర్శించుకోలేరన్నారు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మౌజన్ను హత్య చేయడం, గుంటూరు జిల్లాలో మైనారిటీలపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు కాకపోవడం దురదృష్టకరమన్నారు.