రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సుధాకర్ ఆత్మహత్య.. చంద్రబాబు చేయించిన హత్య
28 Jul 2018 4:18 PM
తిరుపతి: ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో సుధాకర్ చేసుకుంది ఆత్మహత్య కాదని.. చంద్రబాబు చేయించిన హత్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. పోరాటం ద్వారానే హోదా సాధ్యమవుతుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్యలు సరైన విధానం కాదు.. ప్రభుత్వం ఎంత మొండి వైఖరికి సుధాకర్ మరణం నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. హోదా వస్తే లాభాలేంటో చెప్పి.. అధికారం గద్దెనెక్కిన తరువాత హోదా అవసరమే లేదని విషప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లుగా వైయస్ జగన్ పోరాటం వలన హోదా నినాదం ఇంకా బతికి ఉందన్నారు. చంద్రబాబు చేసిన ద్రోహానికి గతంలో మునికోటి.. నేడు నిరుపేద చేనేత కార్మికుడు సుధాకర్ బలిదానమయ్యారన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదన్నారు.