మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అది దగా కోరు దీక్ష
25 Apr 2018 1:01 PM
తిరుపతి: ఈ నెల 30న సీఎం చంద్రబాబు తిరుపతిలో తలపెట్టిన దీక్ష దగా కోరు దీక్ష అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట భూమన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. ఈ నెల 20న చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అన్నారు. నాలుగేళ్లుగా హోదాపై చంద్రబాబుకు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇప్పుడేందుకు దొంగదీక్షలు చేస్తున్నారని భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నించారు. కేసుల భయంతోనే హోదాపై చంద్రబాబు మాట్లాడలేదని విమర్శించారు. వైయస్ జగన్ పోరాటం వల్లే హోదాపై ప్రజల్లో ఆదరణ లభించిందన్నారు.అందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో తలపెట్టిన సభ దగా కోరు సభ అని భూమన అభివర్ణించారు.