పట్టుదల గల నేత వైయస్‌ జగన్‌

విశాఖః ప్రజల కోసం ఎన్నివేల కిలోమీటర్లయిన నడిచే పట్టుదల జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలో కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సమర్థ నాయకత్వం కలిగిన జననేత జగనే  రాష్ట్రానికి రథసారధిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌  మనోసంకల్పమే రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువస్తుందన్నారు.రాష్ట్రంతో బాటు ప్రపంచం అంతా జననేత వైపు చూస్తుందన్నారు.ప్రజా సంకల్పయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైయస్‌ జగన్‌ ప్రజలకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారన్నారు.
 
Back to Top