వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు బాబు విశ్వ ప్రయత్నాలు


–  వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
గుంటూరు:  వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అన్నారు. అందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. గుంటూరులో నిర్వహించిన బూత్‌ కమిటీ శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించుకోవడం గొప్ప విషయమని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అన్నారు. ౖనాలుగేళ్లు రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీని ఎంత తొందరగా పంపితే అంత మంచిదని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top