రైల్వే జోన్ కోసం పోరాటం ఉధృతం

విశాఖ‌ప‌ట్నం) విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ మేర‌కు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ ను రూపొందించుకొంటోంది. కేంద్రం దిగి రాక‌పోతే ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డులో  పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మళ్ల విజయప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, కర్రి సీతారం పాల్గొన్నారు. రైల్వే జోన్ కోసం చేయాల్సిన ఉద్య‌మంపై చ‌ర్చించారు. ఉత్త‌రాంధ్రకు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఈ విష‌యంలో టీడీపీ సాగిస్తున్న డ్రామాల్ని నాయ‌కులు ఎత్తి చూపారు. 
 

తాజా వీడియోలు

Back to Top