రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎంపీ పదవులు వదులుకున్నాం

- మా రాజీనామాలు ఆమోదించినందుకు సంతోషం 
- మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్‌ : విభజన హామీల అమలు, ప్రత్యే హోదా విషయంలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలు లోక్‌స‌భ స్పీక‌ర్ ఆమోదించినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులు వదులుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో నాలుగేళ్లు పోరాటం చేశామ‌ని, చివ‌రి అస్త్రంగా త‌మ ఎంపీ ప‌ద‌వులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదిక‌గా ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు కూర్చున్నామ‌న్నారు. మా పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించిన మార్గంలోనే నడిచి ఏపీకి హోదా కోసం రాజీనామా చేశామ‌న్నారు. మా రాజీనామాల ఆమోదం కచ్చితంగా టీడీపీకి చెప్పుదెబ్బ. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులు వదులుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ టీడీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి పదవులు అనుభవించారు. ఇప్పటికీ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదంటే.. పదవులు లేకుంటే వారు ఒక్కరోజు కూడా ఉండలేరని ఏపీ ప్రజలు గుర్తించారని వారు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

పోరాడుతూనే ఉంటాం : వ‌ర‌ప్ర‌సాద్‌
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ 13సార్లు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణాలు ప్రవేశపెట్టామ‌ని వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలిశాం. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగాం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాం. ఓటమి భయంతోనే టీడీపీ మాపై బురద చల్లుతోంది. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదాను అవహేళన చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నారు. హోదా ఉద్యమం ఉధృతం కావడంతో బాబు తన అలవాటు ప్రకారం యూటర్న్‌ తీసుకున్నారని’  మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు.  
Back to Top