వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సబ్సిడీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి
24 Jan 2015 3:15 PM
జమ్మలమడుగు: వైఎస్ఆర్ కడప జిల్లాలో రబీ సీజన్లో సాగుచేసిన శనగ, ధనియాల పంటలు అకాల వర్షాలతో పూర్తిగా తుడిచి పెట్టుకొనిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో 615 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎక్కడా కూడా కనీస వర్షపాతం నమోదు కాలేదన్నారు. రబీ సీజన్లో అరకొర వర్షం పడి భూమి పదును కాకున్నా రైతులు శనగ, ధనియాల పంట సాగుకోసం ముందుకు వచ్చారన్నారు. అయితే సరైన వర్షాలు నమోదు కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా ఇంత వరకు ఎంత ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇస్తారో ప్రకటించకపోవడం దారుణమని పేర్కొన్నారు.