గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్దమే : పొంగులేటి

హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయమైన లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల సమావేశం సోమవారం జరిగింది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాలని అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.
Back to Top