నరసరావుపేటలో నేడు ‘వైయస్ఆర్ జనభేరి’

గుంటూరు:

వైయస్ఆర్ ‌కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో ‘వైయస్‌ఆర్ జనభేరి’ సభ నిర్వహి‌స్తారు. ఖమ్మం జిల్లాలో బుధవారం వైయస్‌ఆర్ జనభేరి సభ ముగించుకుని‌ రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత శ్రీ జగన్ గుంటూరు చేరుకున్నారు. గురువారం గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంట‌ర్‌లో జరిగే సభలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖ‌ర్‌ తెలిపారు. ఈ సభలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరతారు.

Back to Top