సమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం

ధర్మవరం( అనంతపురం)ః టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు...ఏడాదిన్నరయినా అయినా ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. 

ఇప్పటికీ రెండు డీఏలు ఇవ్వాలి. ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఉద్యోగ నేతలు ఫైరయ్యారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయంలో గానీ , హెల్త్ కార్డుల విషయంలోగానీ ఉద్యోగులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వాపోయారు.  ఉపాధ్యాయులకు రావాల్సిన పెన్షన్ బకాయిలను చెల్లించడంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  

Back to Top