సత్తెనపల్లెలో వైయస్ఆర్ కుటుంబం

సత్తెనపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని 28వ వార్డులో ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గం లోని పట్టణంతో పాటు సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోని 230 పోలింగ్‌ బూత్‌ల్లో వైయస్సార్‌ కుటుంబం ప్రారంభమవుతుందన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్‌ కన్వినర్లు, సభ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తాజా వీడియోలు

Back to Top