మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జోరుగా సాగుతున్న ‘వైయస్సార్ కుటుంబం’
13 Sep 2017 5:54 PM
రైల్వేకోడూరు :రైల్వేకోడూరులో వైయస్సార్ కుటుంబంలో సభ్యత్వ కార్యక్రమం జోరుగా సాగుతోంది. పట్టణంలోని ధర్మాపురం ఏరియాలో బుధవారం పార్టీ నాయకులు ప్రతి గడపకు వెళ్లి వైయస్సార్ను గుర్తు చేశారు. వారి నుంచి కాల్ సెంటరుకు ఫోన్ చేసి వైయస్సార్ కటుంబంలో సభ్యత్వం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తమకు డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ రావడం లేదన్నారు. కార్యక్రమంలో ఆ ఏరియా బూత్ కన్వీనర్ పుష్పలత, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ బాబు, ఉప కన్వీనర్ రౌఫ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఈ మహేష్, పార్టీ నాయకులు రాజా, శివ, శంకర, చైతన్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.