‘వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం’ ఇన్‌చార్జ్‌ల నియామకం

బెళుగుప్ప:వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ గడపగడపకూ తీసుకెళ్లే విధంగా నియోజకవర్గంలో క్లస్టర్‌ల వారిగా ఇన్‌చార్జ్‌లను నియమించినట్టు మంగళవారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని ఎన్‌ గుండ్లపల్లి, శ్రీరంగాపురం, బూదివర్తి, నక్కలపల్లి గ్రామాలకు బెళుగుప్ప సర్పంచ్‌ రామేశ్వరరెడ్డి, యలగలవంక, నరసాపురం, రమనేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు భాస్కర్‌రెడ్డి, ఆవులెన్న, విరుపాపల్లి, ఎర్రగుడి గ్రామాలకు తిమ్మారెడ్డి, యలగలవంక శీనలను నియమించారు. వెంకటాద్రిపల్లి, శీర్పి, కోనాపురం గ్రామాలకు కాలువపల్లి తిమ్మన్న, తగ్గుపర్తి, బెళుగుప్ప గ్రామాలకు అశోక్, రామసాగరం, జీడిపల్లి, కోనంపల్లి గ్రామాలకు నక్కలపల్లి రవి, కాలువపల్లి, హనిమరెడ్డిపల్లి, గంగవరం గ్రామాలకు సుదర్శనరెడ్డి, కాలువపల్లి వెంకటేశులును నియమించారు. దుద్దేకుంట, అంకంపల్లి, వీరాంజనేయకొట్టాల గ్రామాలకు నరసింహులును ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరు ఆయా క్లస్టర్‌లలో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Back to Top