పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు
23 Jun 2018 1:20 PM
- నినదిస్తున్న వైయస్ఆర్సీపీ శ్రేణులు
- కడప మహా ధర్నాకు పోటెత్తిన జనం
వైయస్ఆర్ జిల్లా: కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ వైయస్ఆర్సీపీ శ్రేణులు, వైయస్ఆర్ జిల్లా ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ.. కడపలో ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో స్టీల్ ప్లాంట్ సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కడపలో వెంటనే స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్సీపీ శనివారం నగరంలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద దివంగత నేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైయస్ఆర్సీపీ నేతలు మహాధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, టీడీపీ, బీజేపీ నేతల మోసపూరిత వైఖరిపై పార్టీ నేతలు మండిపడ్డారు. కడప్ స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేమిటని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన స్టీల్ ప్లాంట్ను అడ్డుకుంది చంద్రబాబేనని.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ మహాధర్నాలో వైయస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు