జనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ రక్తదానం
01 Oct 2013 3:34 PM
హైదరాబాద్, 1 అక్టోబర్ 2013
: జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున శిబిరాలు నిర్వహించింది. రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించి, దానిపై అవగాహన కల్పించడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి కృషి చేస్తోంది. 'మనందరం తెలుగువారం. మన రక్తంలో ఎలాంటి కల్మషం లేదు. ఏకరూపత ఉంది. ఐక్యతా ఉంది. మనమంతా ఒక్కటే' అనే స్ఫూర్తితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించింది. అక్టోబర్ 1న జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రక్తదానానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే విడుదల చేశారు.
'అందరికీ ఆరోగ్యం' మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయం. అదే స్ఫూర్తితో ఆ మహానేత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అది ఎందరికో ప్రాణదానం చేసింది. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను రక్తదానం చేయాలంటూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది.
సామాజిక బాధ్యతలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా కృషి చేస్తోంది. గత ఏడాది నిర్వహించిన రక్తదాన శిబిరానికి పార్టీ నాయకులు, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శిబిరాలు నిర్వహిస్తోంది. 'రక్తాన్ని దానం చేయండి.. ప్రాణాన్ని కాపాడండి' అని పార్టీ నాయకులు ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తోంది.
జాతీయ రక్తదాన దినోత్సవం సందర్బంగా ఖమ్మంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొంగులేటి స్వరాజ్యం- రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. శివభరత్రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పార్టీ కన్వీర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంటరీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో పాల్గొన్నారు.