వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్ 20 సెప్టెంబర్ 2013:

శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయం దగ్గర వున్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి... పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఆ తరువాత.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అటునుంచి అసెంబ్లీ వైపు పాదయాత్రగా వెళ్దామనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.  ప్రజాప్రతినిధులను గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి చంద్రబాబు రాసిన లేఖే కారణమని పార్టీ నేతలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Back to Top