వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సమైక్య ఉద్యమంపై చర్చించాం
26 Sep 2013 5:32 PM
హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేసే ఉద్యమం కోసం సీపీఎంతో చర్చించామని వైయస్ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి మైసూరా రెడ్డి వెల్లడించారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో తమ మధ్య చర్చలు సాగాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఐక్యత కోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా రెడ్డి తెలిపారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉంది కాబట్టి కలిసి ఉద్యమిద్దామనే కోణంలో ఆ పార్టీ నేతలతో చర్చించామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ చర్చల్లో పాల్గొన్న బి.వి.రాఘవులు అనంతరం మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ బృందం కలిసి పనిచేద్దామని తమతో ప్రతిపాదించిదన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపినట్లు రాఘవులు తెలిపారు.