ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్సార్ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాలతోపాటు అన్నదాన కార్యక్రమాలు, బట్టలు, పండ్ల పంపిణీ సహా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ అభిమాన నేత గత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అదేవిధంగా గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ప్రతీ ఇంటికి వెళ్లి బాబు రెండేళ్ల అవినీతి, మోసపూరిత పాలనను ఎండగడుతున్నారు. 

అనంతపురం జిల్లా :
వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జిల్లాలో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకనలు నిర్వహించారు. క‌దిరిలో వైయస్ జ‌యంతి ఘనంగా నిర్వ‌హించిన వైయస్సార్ సీపీ స‌మ‌న్వ‌య క‌ర్త సిద్దారెడ్డి. అనంత‌పురం ఉర‌వ కొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి వైయస్ విగ్ర‌హానికి పూల మాల‌వేసి నివాళులు అర్పించారు. పుట్టపర్తిలో వైయస్సార్సీపీ నేత శ్రీధర్రెడ్డి , డా. హరికృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిలమత్తూరులో వైయస్సార్సీపీ నేత నవీన్ నిశ్చల్ వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతపురం నగరంలో వైయస్ జయంతి సందర్భంగా చవ్వా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి వైయస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. , అనంతరం ఆయన గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. 


చిత్తూరు జిల్లా:
బీఎన్ కండ్రిగలో పార్టీ నేతలు కోనేటి ఆదిమూలం, విద్యానాథరెడ్డిలు వైయస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. అనుప్పల్లిలో వైయస్సార్సీపీ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుప్పంలో పార్టీ ఇంఛార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో వైయస్ జయంతి సభ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలమనేరులో చైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకూ  వైయస్సార్సీపీ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బి.కొత్తకోటలో జడ్పీటీసీ రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  అరగొండలో సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. తిరుపతిలో గాంధీపురంలో వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లెలో దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్సార్సీపీ నిర్వహించారు.

వైయస్సార్ జిల్లా : 
రాయ‌చోటి బ‌స్టాండ్‌లో వైయస్సార్ జ‌యంతి సంద‌ర్బంగా వైయస్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసిన రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట  శ్రీ‌కాంత్ రెడ్డి. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దువ్వూరులో గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పార్టీ నేత తిరుపాల్ రెడ్డి. ప్రొద్దుటూరులో  వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైల్వే కోడూరులో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, కె. బ్రహ్మానందరెడ్డి, సుకుమార్రెడ్డి. పోరుమామిళ్ల మండలం గుర్రప్పగారిపల్లె నుంచి  గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్రెడ్డి, ఎంపీపీ విజయప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ శారదమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో పార్టీ నేత సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. 


కర్నూలు జిల్లా :
జిల్లాలో మహానేత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైయస్సార్సీపీ ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో వైయస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైయస్ జ‌యంతిని పుర‌స్కరించుకుని వైయస్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్ర‌సాద్‌రెడ్డి. మ‌ద్దికెర‌లో వైఎస్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించిన ఎంపీ బుట్టారేణుక‌.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి,  జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి వేదాయపాలెంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిమంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు జరిగాయి. ఆత్మకూరులో వైయస్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వైయస్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ నేత రాజ్కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్. కొడవలూరు మండలం రాజుపాలెంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం ఆయన గడప గడపకూ వైయస్సార్  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా:
మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో వైయస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో  వైయస్ యువసేన నాయకుడు వరికూటి అశోక్బాబు పాల్గొన్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన యాదవ్ వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిద్ద‌లూరు స‌మన్వ‌య క‌ర్త బ‌వీరెడ్డి ఆధ్వ‌ర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. 

గుంటూరు జిల్లా :
క్రోసూరు అచ్చంపేట, అమరావతి, పెద్దకూరపాడు, బెల్లంకొండ సహా పలు మండలాల్లో వాడవాడలా వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేత కావటి శివనాగ మనోహరనాయడు పాల్గొన్నారు. వైయస్సార్ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని రైతుబజార్ సమీపంలో సేవాదళ్ జిల్లా కన్వీనర్ చిన్నపురెడ్డి ఆధ్వర్యంలోకూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. పొన్నూరు మార్కెట్ సెంటర్లో వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రావి వెంకటరమణ, వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు. బాపట్లలో కోన రఘుపతి ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా వెదుళ్లపల్లి ప్రజలతో ఎమ్మెల్యే కోన రఘుపతి ముఖాముఖి నిర్వహించారు.


కృష్ణాజిల్లా :
గుడివాడ‌లో కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా  వైయస్ జ‌యంతి వేడుక‌లు. కండ్రిగలో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ. వైయస్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం, మైలవరంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఊర్మిళ నగర్లో జరిగిన వైయస్ జయంతి వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆరిఫ్తోపాటు పలువురు కార్పొరేటర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  కొందూరు మండ‌లం చిన నందిగామ‌లో వైయస్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించిన అభిమానులు,కార్య‌క‌ర్త‌లు.

 
పశ్చిమగోదావరి జిల్లా :
వైయస్సార్ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ నేత రాజీవ్కృష్ణ. 
టి.నరసాపురం మండలం సింగరాజుపాలెంలో తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభించారు. చింతలపూడిలో జానకీ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంచారు. ఏలూరు నగర సిటీ కన్వీనర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 50 డివిజన్లలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దెందులూరు నియోజకవర్గం కలపర్రులో కొటారు రామచంద్రరావు, అప్పన ప్రసాద్ ఆధ్యర్యంలో, ఉంగుటూరు నియోజకవర్గంలో కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు జరిగాయి. తణుకులో మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు జరిగాయి. ఉండి నియోజకవర్గంలో పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో వైయస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం పాలకోడేరులో గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. 

తూర్పుగోదావరి జిల్లా :
వైయస్ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు సెంటర్లో  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్ వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు. పార్టీ నేత వాసిరెడ్డి జమీల్  రైతులపూడిలో వైయస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రత్తిపాడులో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నేత మురళీ రాజు.


విశాఖపట్నం జిల్లా :
నర్సీపట్నంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఉమాశంకర్ గణేష్, కోనేటి రామకృష్ణ, ధనమ్మ పాల్గొన్నారు. మాడుగులలో  ఎమ్మెల్యే బి.ముత్యాలనాయుడు  వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత గడప గడపకూ వైయస్ఆర్ కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో వైయస్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసిన కరణం ధర్మశ్రీ. ఆర్కే బీచ్లోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. గాజువాకలో తిప్పలనాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.


శ్రీకాకుళం జిల్లా :
నరసన్నపేట మండలం పోతయ్య వలసలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. రణస్థలం మండలం మహంతిపాలెంలో ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆముదాలవలస మండలం రామచంద్రాపురంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. సీతంపేట మండలం వణుకువలసలో పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం ప్రారంభమైంది.

Back to Top